Monday, October 12, 2015

పట్టిసీమ ప్రాజెక్ట్

                                           కరువు జయిద్దాం

కరువు రాక్షసితో  పోరాడుదాం . కరువును జయిద్దాం అంటూ  ముఖ్యమంత్రి  ఇచ్చిన పిలుపుకు స్పందించి
అహర్నిశలు శ్రమించి  గల గలా కదిలే గోదారిని బిర బిరా పరుగులిడే  క్రిష్ణమ్మతో అనుసంధానం  చేసిన అధికారులకు  ప్రశంశలు ..

               1941వ  సం :లో  మద్రాస్ ప్రెసిడెన్సి నీటిపారుదల శాఖలో  చీఫ్ ఇంజనీర్  గ పనిచేస్తున్న  లేట్ వెంకట కృష్ణ అయ్యర్ మొట్టమొదటి సర్వే నిర్వహించి 350000 ఎకరాలకు సాగునీరు  40 మెగా వాట్ల విద్యుత్ కొరకు పోలవరం  వద్ద డాం నిర్మాణానికి ప్రభుత్వానికి  నివేదిక పంపినారు .

                1980లో అప్పటి ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రి  శ్రీ అంజయ్యగారు పోలవరం ప్రాజెక్ట్ కు  శంఖుస్థాపన చెసినారు. కాని 2004 వరకు  ఎటువంటి  పురోగతి లేదు .. 2004లో అప్పటి ముఖ్యమంత్రి  డాక్టర్ :వై ఎస్ . రాజశేఖర రెడ్డి గారు పోలవరం ప్రాజెక్ట్ కొరకు  నిధులు మంజూరు చెసినారు.  

                రాష్ట్ర విభజన తరువాత ప్రమాణ స్వీకారం చేసిన నవ్యాంధ్ర నూతన ముఖ్యమంత్రి  శ్రీ నారా
.చంద్రబాబునాయుడు  గారి ముందుచూపు మరియు పట్టుదల కారణంగా అనుకున్న సమయానికి నదుల అనుసంధానం దిగ్విజయంగా జరిగింది. దెశంలోనే మొదటి స్థానంలో నిలిచినాము.


ఎన్ని అడ్డంకులొచ్చినా ఎన్ని అవాంతరాలెదురైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం. ఒక్కటే ధ్యేయం...కరువును జయించాలి. కరువుసీమ రాయల సీమను చూసి నేడు కరువు భయపడింది. గోదావరి క్రిష్ణమ్మల అపూర్వ సంగమం. ఆంధ్రుల చిరకాల స్వప్నం సాకరమైన వేళ. 50 సం:ల ఎదురుచూపుకు ఫలితం. భాగీరధ యత్నం సఫలం.
ఒక చారిత్రక ఘట్టం. తాడిపూడి నుండి 174కిమీ. ప్రయాణించి సెప్టంబరు 15వ తేది క్రిష్ణానదిలో గోదావరి సంగమం. నదీపరివాహక ప్రాంతాలకు మనం వెళ్ళడం నాటి కథ. మనమున్న చోటుకే నదులను రప్పించడం నేటికథ.

            


No comments:

Post a Comment